HomeTelugu Big StoriesSamantha కోసం కథలు రాయడం ఆపేశాం అంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Samantha కోసం కథలు రాయడం ఆపేశాం అంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram interesting comments on Samantha sets the internet on fire
Trivikram interesting comments on Samantha sets the internet on fire

Trivikram about Samantha:

ప్ర‌ముఖ నటి స‌మంత తన కొత్త వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్ని పనులతో బిజీగా ఉంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్‌ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా, ఇది నవంబర్‌లో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. సిటాడెల్ ప్రమోషన్లు మొదలయ్యే ముందు, స‌మంత ఒక ప‌బ్లిక్ ఈవెంట్‌లో హాజ‌రయ్యారు.

తాజాగా బాలీవుడ్ భామ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా జిగ్రా తెలుగు ప్రీ-పిలీజ్ ఈవెంట్‌కు స‌మంత హాజర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజర‌య్యారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ స‌మంత గురించి చాలా గొప్పగా మాట్లాడారు. “ర‌జినీకాంత్ గారి త‌ర్వాత స‌మంత‌గారికి తెలుగు, తమిళం, మలయాళంలో సమానమైన అభిమానులున్నారు. నేను ఈ మాట ప్రేమతో చెప్పడం లేదు. నిజంగా నా హృదయంతో చెబుతున్నాను” అని త్రివిక్రమ్ అన్నారు.

“స‌మంత‌గారు, ముంబైకి మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్‌కు కూడా రండి. మీరు ఇక్కడకు రాకపోతే, మీ కోసం కథలు రాయడం లేదు. మీరు తెలుగు సినిమాల్లో నటిస్తారా అని అనుమానాలు వస్తున్నాయి. మీరు ఒప్పుకుంటే, మీ కోసం పాత్రలను తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు త్రివిక్ర‌మ్.

త్రివిక్ర‌మ్ మాట్లాడిన మాట‌లు బట్టి.. త్రివిక్ర‌మ్ త‌దుపరి చిత్రంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సమంత కీ రోల్ చేయ‌డం లేదు అని తేలిపోయింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో స‌మంత అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ..ఆ.. వంటి సినిమాలలో నటించింది. అన్నీ బ్లాక్ బస్టర్ లు కావడం విశేషం.

Read More: Megastar Chiranjeevi ఊటీ లో కొన్న ప్రాపర్టీ కి ఎంత ఖర్చయిందో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu