HomeTelugu Newsఎపీ సీఎంను కలిసిన టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ల భేటీ..

ఎపీ సీఎంను కలిసిన టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ల భేటీ..

13 17
బాలీవుడ్ తరువాత దేశంలో పెద్ద సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు రాష్ట్రాలకు మంచి ఆదాయం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం ఒక్కటిగానే ఉండేది. రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాలకు ఆదాయం లభిస్తోంది. అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి ముఖ్యమంత్రులను కలిసినా ఆహ్వానిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు జగన్‌ను కలిశారు. గతంలో విశాఖలో హుద్ హుద్ తుఫాన్ వచ్చినపుడు, అక్కడి ప్రజలు చాలామంది నిరాశ్రయులయ్యారు. హుద్ హుద్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును విశాఖలో నిరాశ్రయులైన వారికోసం ఇళ్లను నిర్మించింది. వాటి ఓపెనింగ్ కు రావాలని జగన్ ను ఆహ్వానించారు తెలుగు సినిమా నిర్మాతలు. దీనిపై జగన్ సానుకూలంగా
స్పందించారని, తప్పకుండా వస్తారని చెప్పారని నిర్మాతలు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!