HomeTelugu Trendingటిక్‌ టాక్ క్వీన్ ఎవరో తెలుసా..!

టిక్‌ టాక్ క్వీన్ ఎవరో తెలుసా..!

11 12

ప్రభాస్‌ సరసన ‘సాహో’ చిత్రంలో ‘బ్యాడ్‌ బాయ్‌’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ అందాల భామ 2019 ‘టిక్‌టాక్‌ ఇండియా క్వీన్‌’గా అవతరించింది. టిక్‌టాక్‌ రైవైండ్‌ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్‌ వీడియోల జాబితా విడుదలైంది. అందులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ అత్యధిక ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. జాక్వెలిన్‌ 9.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఆ తరువాత రితేష్‌ దేశ్‌ముఖ్‌ (6.8 మిలియన్స్) కపిల్‌ శర్మ (2.2 మిలియ్‌న్స్‌), మాధురీ దీక్షిత్‌(1.2 మిలియన్స్‌)లు అత్యధిక మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. జాక్వెలీన్‌ హాట్‌ హాట్‌ బికినీలతోనే కాదు టిక్‌టాక్‌లోనూ తనదైన శైలితో అభిమానులను సంపాదించుకుంది. 2019 ఇండియా టిక్‌టాక్‌ క్వీన్‌గా అవతరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!