HomeTelugu Trendingఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. సింగర్‌ చిత్ర ఎమోష‌న‌ల్ పోస్ట్

ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. సింగర్‌ చిత్ర ఎమోష‌న‌ల్ పోస్ట్

3 17
తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సుశీల,జానకి ల తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించుకుంది సింగర్‌ చిత్ర. త‌న పాట‌ల‌తో సంగీత ప్రియులని ఎంత‌గానో ప‌ర‌వ‌శింపజేసే చిత్ర త‌న కూతురి వర్ధంతి సందర్బంగా తన సోషల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. కూతురు అంటే ఎంతో ప్రేమగా చూసుకునే ఆమెకు ఆ చిన్నారి మరణం ఇప్పటికీ మరిచిపోలేని గాయంగా మిగిలిపోయింది.

ఏళ్లు గడుస్తున్నా పాపని పోగొట్టుకున్న బాధ అలానే ఉంది. ప్రతి పుట్టుకకి ఓ కారణం ఉంటుందని పెద్దలు చెబుతారు. అది పూర్తైతే ఆత్మ ప్రపంచాన్ని వెళ్లిపోతుందని విన్నాం. అంతేకాక కాలం గాయాన్ని కూడా నయం చేస్తుందని అంటుంటారు. అది నిజం కాదు నాకు తగిలిన గాయం ఇంకా పచ్చిగా ఉంది, ఇది అనుభవించే వారికే తెలుస్తుందని చిత్ర స్పష్టం చేశారు. 2011లో సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ కాన్సర్ట్‌లో ప్రదర్శన కోసం చిత్ర తన ఎనిమిదేళ్ల కుమార్తె నందనతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. అక్కడ ఆ చిన్నారి ప్రమాదవశాత్తు స్విమింగ్ పూల్ లో పడి మరణించింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!