HomeTelugu News'యాత్ర' చేయనున్న ప్రముఖ నటి

‘యాత్ర’ చేయనున్న ప్రముఖ నటి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకి మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో ప్రముఖ స్టార్ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

7 23

ఈ సినిమాలో ప్రముఖ నటి కళ్యాణి కూడ ఒక కీలక పాత్ర చేయనుంది. ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, పెదబాబు, దొంగోడు’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందిన కళ్యాణి ‘లక్ష్యం, మున్నా, లెజెండ్’ వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. ఇంతకీ ఈమె సినిమాలో ఏ పాత్ర చేస్తున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!