ప్రముఖ దర్శకుడు, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముకుల్చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఓ చానల్ ఇంటర్వ్యూలో సెల్వమణి ఆరోపించారు.
ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ముకుంద్చంద్.. సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత ముకుంద్చంద్ చనిపోయినా ఆయన కుమారుడు గగన్బోత్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణ జరగ్గా సెల్వమణి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో చెన్నై జార్జ్టౌన్ కోర్టు ఆయనపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది.