మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఉప్పెన’. కీర్తీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి స్పందన వచ్చింది.
ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ పాట విడుదల కానుంది. ఉప్పెన సినిమాలోని ‘రంగులద్దుకున్న’ అనే పాటను మహేష్ బాబు నవంబర్ 11న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉండనుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Get ready to dive into the ocean of Love ❤️#Ranguladdhukunna will be on your favorite songs playlist from 11th Nov @ 4:05 PM
Thank you Superstar @urstrulyMahesh garu 🎶#Uppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty#BuchiBabuSana @ThisIsDSP @aryasukku @adityamusic pic.twitter.com/QtoeXmNQvM
— Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2020