HomeTelugu NewsKeerthy Suresh: ఆ ఒక్క సీన్ కోసం డబుల్ రెమ్యూనరేషన్ !

Keerthy Suresh: ఆ ఒక్క సీన్ కోసం డబుల్ రెమ్యూనరేషన్ !

keerthy suresh bollywood we Keerthy Suresh, Double remuneration

కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్.. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి.. ఆ సినిమాతో అందరిని ఫిదా చేసింది.

తెలుగు, తమిళం, మలయాళం లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం బాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ చిత్రం కోసం కీర్తి సురేష్.. భారీ రెమ్యూనరేషన్ తీసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో ఆఫర్ రాగానే కీర్తి సురేష్ ఆలోచించిందట.. అంతేకాకుండా ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయని దర్శకుడు ముందే చెప్పారట. ముందుగా నో అన్నా కానీ ఆ తర్వాత మాత్రం సినిమా వారు.. డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో.. కాదనలేకపోయిందని టాక్.

సినీ వర్గాల సమాచారం ప్రకారం బేబీ జాన్ కోసం కీర్తి సురేష్ 6 నుంచి 8 కోట్ల దాకా పారితోషికం అందుకుందని.. అందుకే ఈ హీరోయిన్ ఆ సినిమాలో  లిప్ లాక్ సీన్లో కూడా కనిపించనుందని.. అలానే గ్లామర్ రోల్ పోషించనుందని వినికిడి.

అయితే ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియాలి అంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu