HomeTelugu Trendingకరోనా రోగుల కోసం బాలీవుడ్ గాయని సంచలన నిర్ణయం!

కరోనా రోగుల కోసం బాలీవుడ్ గాయని సంచలన నిర్ణయం!

5 25
బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకడం ఆ తర్వాత ఆమె మళ్లీ పార్టీలకు వెళ్లడం. దీనిపై కనికా కపూర్‌పై కేసు కూడా ఫైల్ చేసారు పోలీసులు ఇదంతా తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందింది కనికా వరసగా నాలుగు సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఐదోసారి ఆమెకు నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. కుటుంబ సభ్యులు. అయితే లీకరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కనికా ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా కరోనా రోగుల చికిత్సలో పని చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ప్లాస్మా ఇచ్చేందుకు కరోనా రోగులు కొందరు ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కనికా కపూర్‌ తన ప్లాస్మా ఇస్తానంటూ లక్నోలోని కింగ్‌ జార్జ్ మెడికల్‌ వర్సిటీ (కేజీఎంయూ) ఆసుపత్రికి తెలిపింది. కనికా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లక్నోలో ఉంటున్నారు. ప్లాస్మా థెరపీ సత్ఫలితాలనిస్తుండటంతో ఢిల్లీ, కేరళ సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీని అందిస్తున్నారు. కేజీఎంయూలో కోలుకున్న ముగ్గురు తమ ప్లాస్మాను దానం చేశారు. కాగా కనికా ప్లాస్మా చికిత్సకు పనికి వస్తుందా? అనే అంశాన్ని ముందు వైద్యులు పరీక్షించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!