HomeTelugu Trendingతన మైనపు విగ్రహంతో ఫొజులిచ్చిన కాజల్‌ అగర్వాల్‌

తన మైనపు విగ్రహంతో ఫొజులిచ్చిన కాజల్‌ అగర్వాల్‌

2a
టాలీవుడ్‌లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది కాజల్‌ అగర్వాల్‌. దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ రోజు ఫిబ్రవరి 5 (బుధవారం) మేడమ్‌ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి సింగపూర్‌కు చేరుకున్న ఈ చందమామ.. అక్కడి కొలువుదీరిన ఆమె విగ్రహంతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌​ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో తమ అభిమాన హీరోయిన్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కాజల్‌ ఫ్యాన్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు. దక్షిణాది నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరోయిన్‌గా కాజల్‌ రికార్డుకెక్కారు.

2 5

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!