రణ్బీర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం ‘బ్రహాస్త్ర: మొదటి భాగం శివ’ పేరిట సెప్టెంబర్ 9న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్కు రెడీ అవుతోంది మూవీయూనిట్. అందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహాస్త్ర చిత్రయూనిట్ ఓ స్పెషల్ మీడియాను విడుదల చేసింది.
Gear up for a MASS-Traverse!🔥🔥🔥
MAN OF MASSES of Indian Cinema, @tarak9999 will be gracing the Biggest Pre-Release Event of Brahmāstra as the Chief Guest on September 2nd in Hyderabad💥 #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/grV1DgX2qY
— BRAHMĀSTRA (@BrahmastraFilm) August 27, 2022