HomeTelugu Trendingబాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధమవుతున్న టాలీవుడ్ March Releases

బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధమవుతున్న టాలీవుడ్ March Releases

Huge competition among the March Releases
Huge competition among the March Releases

March Releases in Tollywood:

తెలుగు సినిమా ఇండస్ట్రీకి మార్చి 2025 కీలక నెలగా మారబోతోంది! ఫిబ్రవరి 2025లో ఎక్కువ సినిమాలు నిరాశపరిచాయి. నాగ చైతన్య ‘తాండెల్’ ఒక్కటే హిట్‌గా నిలిచింది. దీంతో ప్రేక్షకులు మార్చిలో విడుదల కాబోయే సినిమాలపై బాగా ఆసక్తి చూపుతున్నారు.

తెలుగు సినిమాలు:

మార్చి 7న ‘14 డేస్ (గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో)’ అనే థ్రిల్లర్ రిలీజ్ అవుతోంది. మార్చి 14న కిరణ్ అబ్బవరం ‘దిల్రుబా’, నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మార్చి 21న వినోదభరితమైన ‘పెళ్లికాని ప్రసాద్’ రాబోతోంది. మార్చి 28న నితిన్ ‘రోబిన్‌హుడ్’, ‘MAD Square’ బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాయి.

డబ్బింగ్ సినిమాలు:

డబ్బింగ్ చిత్రాల పోటీ కూడా తక్కువేం కాదు. మార్చి 7న విక్కీ కౌశల్ హిట్ మూవీ ‘ఛావా’, జివి ప్రకాష్ కుమార్ ‘కింగ్‌స్టన్’, హిందీ ‘ది డిప్లొమాట్’, తమిళ ‘ఆలంబన’ సినిమాలు విడుదల అవుతున్నాయి. మార్చి 14న సునీల్ శెట్టి నటించిన ‘కేసరి వీర్’, మార్చి 21న ‘పింటూ కి పప్పీ’ అనే హిందీ చిత్రం వస్తోంది. మార్చి 27న విక్రమ్ ‘వీర దీర సూరన్ 2’, మోహన్‌లాల్ ‘L2: ఎంపురాన్’ సినిమాలు విడుదలకు రెడీ. మార్చి 30న సల్మాన్ ఖాన్ ‘సికందర్’ థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ మొత్తం సినిమాల జాబితా చూస్తే, తెలుగు సినిమాలకు, డబ్బింగ్ చిత్రాలకు మధ్య పోటీ తీవ్రమై ఉంటుందని అనిపిస్తోంది. ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu