HomeTelugu TrendingPushpa 2: హీరోలకు తలనొప్పిగా మారిన అల్లు అర్జున్

Pushpa 2: హీరోలకు తలనొప్పిగా మారిన అల్లు అర్జున్

Robinhood
Heroes steering the way clear for Allu Arjun Pushpa 2

Pushpa 2 on Dec 6th: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా పుష్ప 2. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప కి రెండవ భాగంగా ఈ చిత్రం త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించారు.

ఈ సినిమాలో తను నటనకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులో మాత్రమే కాక అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా.. రెండవ భాగం కాబట్టి పుష్ప 2 మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలైతే ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ సినిమా.. షూటింగ్ ఇంకా పూర్తవని కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా.. డిసెంబర్ 6న థియేటర్లలో విడుదలవుతుంది అని..చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అయితే పుష్ప 2 సినిమా కొత్త విడుదల తేదీ ఇప్పటికే డిసెంబర్ లో తమ విడుదల తేదీలు ప్రకటించేసిన సినిమాలకి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హడ్ సినిమా డిసెంబర్ 20న విడుదల కావాల్సింది. మరోవైపు నాగచైతన్య నటిస్తు తున్న తండేల్ కూడా అదే రోజున విడుదల కి సిద్ధమవుతోంది.

ఇక నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న తమ్ముడు సినిమా కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అయితే పుష్ప 2 సినిమా విడుదల వాయిదా కారణంగా డిసెంబర్లో విడుదల కావాల్సిన మిగతా సినిమాల మీద ప్రభావం ఉంటుంది అని ముందుగానే అనుకున్న విషయమే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

పుష్ప 2 సినిమా కోసం నితిన్ ఇప్పుడు తన రెండు సినిమాల విడుదల తేదీలను మారుస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమాను డిసెంబర్ మూడో వారం దాకా కాకుండా వీలయినంత ముందుకు తీసుకువచచ్చే ఆలోచన చేస్తున్నారు చిత్ర డైరెక్టర్ వెంకీ కుడుముల. తమ్ముడు సినిమాని కూడా ఫిబ్రవరి కి వాయిదా వేసే ఆలోచనలు చేస్తున్నారట. ఆ రెండు సినిమాల మధ్య గ్యాప్ పెరగడం కోసం ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు కానీ పుష్ప 2 కొత్త విడుదల తేదీ కూడా వీరి నిర్ణయానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు.

More About Pushpa 2:

పుష్ప 2 సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. జగదీష్, జగపతిబాబు, అనసూయ, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu