HomeTelugu TrendingRajamouli కూతురిని లంచ్ కి తీసుకువెళ్లిన బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

Rajamouli కూతురిని లంచ్ కి తీసుకువెళ్లిన బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

Guess the Bollywood star who took Rajamouli's daughter to lunch
Guess the Bollywood star who took Rajamouli’s daughter to lunch

Rajamouli Daughter lunch with Bollywood Star:

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘RRR’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు భారతదేశంలోనే అత్యధిక క్రేజ్ ఉంది. అయితే, రాజమౌళి కూతురు, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య ఓ హృదయపూర్వక సంఘటన గతంలో చోటు చేసుకుంది. ఇప్పుడు అది మళ్లీ వైరల్ అవుతోంది.

ఒకసారి రాజమౌళి కూతురు, సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానిగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, రాజమౌళి సిద్ధార్థ్‌ను కలవాలని అభ్యర్థించారు. ఆశ్చర్యకరంగా, సిద్ధార్థ్ వెంటనే స్పందించి, “అందులో పెద్ద విషయం లేదు సార్! మీ కూతురిని కలవడం ఆనందంగా ఉంది” అని ట్వీట్ చేశాడు.

అంతే కాకుండా, సిద్ధార్థ్ తన స్వంతంగా ముందుకు వచ్చి రాజమౌళి కూతురిని లంచ్‌కి తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన ట్వీట్‌లో రాజమౌళి స్పందిస్తూ, “సిద్ధార్థ్ మీకు చాలా థాంక్స్. మా కూతురు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉంది. మీరు ఆమెకు ఇచ్చిన మంచి సలహాలకు థ్యాంక్యూ” అని పేర్కొన్నారు.

దీనికి సిద్ధార్థ్, “సార్, మీకు థ్యాంక్స్ అవసరం లేదు. ఆమె చాలా స్వీట్‌.. నెక్స్ట్ మిమ్మల్ని త్వరలో కలవాలి అనుకుంటున్నాను” అని ఆన్సర్ ఇచ్చాడు.

ఈ ట్వీట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అభిమానులు సిద్ధార్థ్ మల్హోత్రాకు మెచ్చుకుంటూ, “సింప్లిసిటీ కీ కింగ్”, “రియల్ జెంటిల్‌మాన్” అంటూ పొగిడుతున్నారు.

ప్రస్తుతం రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా రూపొందిస్తున్న SSMB 29 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1000 కోట్ల పైచిలుకు!

ఇది కేవలం ఇండియన్ సినిమానే కాదు, గ్లోబల్ అడ్వెంచర్ లా తెరకెక్కనుంది. మహేష్‌ సరసన ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్‌గా నటించనుండగా, జాన్ అబ్రహాం ఓ కీలక పాత్రలో ఉంటారని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ‘RRR’ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరోసారి మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే, రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ తరహాలో 35mm/70mm స్కానర్స్ ఉపయోగించి అత్యాధునిక టెక్నాలజీతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే 2000 మందికిపైగా టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ సినిమా, ఇండియా సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అవ్వబోతోందని చెబుతున్నారు.

ALSO READ: Ghajini లో కల్పన మరణానికి అసలైన కారణం అదే అంటున్న AR Murugadoss

Recent Articles English

Gallery

Recent Articles Telugu