![Chandrababu Naidu: చంద్రబాబు సంతకం చేయనున్న పెన్ను ప్రత్యేకత ఏమిటో తెలుసా? 1 Chandrababu Chandrababu Naidu,Pen Speciality](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/06/Chandrababu.jpg)
Chandrababu Naidu Pen Speciality
ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. మొదటి సైన్ మెగా డీఎస్సీ పైస్ చేస్తారన్న వార్త ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే చంద్రబాబు సంతకం చేసే పెన్నుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల కోసం ప్రచారం చేసేటప్పుడు జగ్గంపేటలో చంద్రబాబుని ఒక యువతి కలిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి తన తరపున ఒక పెన్ను గిఫ్ట్ గా ఇచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాక ఈ పెన్నుతో మెగా డీఎస్సీ ఫైల్ పై సైన్ చేయాలని ఆమె అప్పట్లో కోరింది.ఆమె కోరిక మేరకు చంద్రబాబు ఇప్పుడు అదే పెన్నుతో ఆ ఫైల్ పై సైన్ చేయనున్నారు.
Chandrababu Naidu’s First Three Signatures
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తొలి సంతకం తప్పకుండా మెగా డీఎస్సీపై ఉండనుంది అని అందరూ అనుకోవటానికి ఒక కారణం ఉంది. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ పార్టీ మెగా డీఎస్సీ అంటూ మోసం చేసిందని.. అందుకేతాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉండే ఛాన్సుంది. ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత.. అనేక బహిరంగ సభలలో ప్రకటించిన సంగతి తెల్సిందే
More About Chandrababu Naidu Oath Ceremony
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం అనగా ఈరోజు ఉదయం.. ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు. కాగా రాష్ట్ర విశిష్ట అతిథిగా.. హాజరు కావాలని కోరుతూ.. మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో.. చిరంజీవి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నాడు. కాగా వీరిద్దరితో పాటు జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఆహ్వానం అందింది. దేవర చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యే అవకాశం ఉంది. అలాగే మోహన్ బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్ తో పాటు మరికొందరు సినీ తారలకు ఆహ్వానం అందినట్లు సమాచారం.