Homeపొలిటికల్Andhra Pradesh లో ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ వెనుక కారణం ఎవరు?

Andhra Pradesh లో ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ వెనుక కారణం ఎవరు?

AP Government 25 Lakh Insurance Scheme to become a Game Changer?
AP Government 25 Lakh Insurance Scheme to become a Game Changer?

Andhra Pradesh Universal Insurance Scheme:

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల యూనివర్సల్ ఇన్సూరెన్స్ కల్పించే యోచనలో ఉంది. ఈ స్కీమ్ అమలు అయితే భారత రాజకీయ చరిత్రలో ఓ విప్లవాత్మక నిర్ణయంగా నిలుస్తుందని రాజకీయ, మీడియా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

ఇక ఈ స్కీమ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. జనసేన అభిమానులు ఈ ఐడియా పవన్ కల్యాణ్‌దే అంటూ, దీన్ని టీడీపీ క్రెడిట్ దొంగిలించిందని ఆరోపిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న సీఎం ప్రకటించిన స్కీమ్‌కు ఆయనే పూర్తి క్రెడిట్ తీసుకుంటారు. ఇది రాజకీయాల్లో సాధారణమే.

అంతేకాదు, ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య శ్రీ స్కీమ్‌ను గుర్తు చేసుకోవాలి. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు ఆరోగ్య శ్రీను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్రభుత్వ భాగస్వామిగా ఉండింది. కానీ ఆరోగ్య శ్రీ క్రెడిట్ ఎప్పుడూ కే చంద్రశేఖర్ రావ్‌కు కాకుండా వైఎస్సార్‌కే దక్కింది. అదే తరహాలో, ఈ యూనివర్సల్ ఇన్సూరెన్స్‌పై పవన్ కల్యాణ్ ఆలోచన పెట్టినా, అమలు చేసేది చంద్రబాబే కాబట్టి క్రెడిట్ ఆయన్నే పలకరించాలి.

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా పేదలకు 5 లక్షల వైద్య బీమా అందిస్తోంది. ఇటీవలే సీనియర్ సిటిజన్లకు 20 లక్షల ఇన్సూరెన్స్ అందించనున్నట్టు ప్రకటించింది. అయితే, చంద్రబాబు సర్కారు తీసుకురానున్న ఈ యూనివర్సల్ ఇన్సూరెన్స్ స్కీమ్ మరింత పెద్దది, మరింత ప్రయోజనకరమైనది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu