Homeపొలిటికల్AP Cabinet సంచలన నిర్ణయాలు.. త్వరలో అమలుకానున్న కొత్త పథకాలు!

AP Cabinet సంచలన నిర్ణయాలు.. త్వరలో అమలుకానున్న కొత్త పథకాలు!

AP Cabinet decides to launch New Schemes soon?
AP Cabinet decides to launch New Schemes soon?

AP Cabinet New Schemes:

తాజాగా జరిగిన AP Cabinet సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. పూర్వ ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించబడిన 7 లక్షల ఎకరాల భూములపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.

పేదలకు భూకేటాయింపు:

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు భూమి అందించడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని అర్హులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ పథకాలపై ఫోకస్:

అదేవిధంగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

పోలవరం, అమరావతి అభివృద్ధి:

పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం త్వరగా మొదలుపెట్టాలని, అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని కేబినెట్ పేర్కొంది.

ఉద్యోగులు, పారిశ్రామిక రంగానికి అనుకూల నిర్ణయాలు:

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషన్ సమస్యలపై చర్చ జరిగింది. ఫెరోఅలాయ్ పరిశ్రమలకు విద్యుత్ సుంకాన్ని తగ్గించడం, కడపలో 2,595 ఎకరాల APIICకి బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు అందించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

రైతులకు పెద్ద ఊరట:

ఈ సీజన్‌లో రూ. 6,200 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. 28.83 లక్షల టన్నుల వరి సేకరణ పూర్తయిందని తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్రపదేశ్:

ప్రతి నెలా 18వ తేదీన స్వచ్ఛ దివస్ జరపాలని నిర్ణయించారు. విజయవాడ అభివృద్ధికి రూ. 294 కోట్లు మంజూరు చేశారు.

ALSO READ: Sivarapalli అతి త్వరలో OTT లో విడుదలకి సిద్ధం!

Recent Articles English

Gallery

Recent Articles Telugu