అనసూయ అంటే టాలీవుడ్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ షోతో తెలుగు అభిమానులను సంపాందించుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈ క్రేజ్తో ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది. ఈ ముద్దుగుమ్మతాజాగా బ్లాక్ చీరపై కోటు ధరించి స్టన్నింగ్ లుక్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.