Homeపొలిటికల్YS Sharmila: ఎన్నికల తరువాత షర్మిల జాడేది?

YS Sharmila: ఎన్నికల తరువాత షర్మిల జాడేది?

YS Sharmila

YS Sharmila: ఏపీలో ఎన్నికలు ముసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఎలక్షన్‌ ప్రచారం రాజకీయనాయకులు చాలా బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో.. చిల్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా లండన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 1 వరకు తన కూతుళ్లతో గడపడానికి లండన్ వెళ్లాడానికి ఆయనకు నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్‌లో తన అభ్యర్థులతో సమావేశమై పోలింగ్ సరళిపై విశ్లేషిస్తున్నారు. ఇక ఇటీవలే వైసీపీ అభ్యర్ధి విజయ్‌సాయి రెడ్డి కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు. మీడియా ముందుకు రావడం లేదు అనే వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో మరో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. షర్మిల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ఆలివ్‌ బ్రాంచ్‌ను షర్మిల పొడిగించారని పుకార్లు వచ్చాయి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అలాంటిదేమీ జరగలేదు అని, షర్మిల జగన్ మోహన్ రెడ్డితో మధ్య ఎలాంటి సంబంధాలు లేదా రాజీకి కుదరలేదు అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత షర్మిల ఎందుకు కనిపించడం లేదు అనే దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోలింగ్ తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు. అయితే ఆమె X లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాన్ని పోస్ట్ చేసింది. షర్మిల తన కొడుకు మరియు తల్లి విజయ లక్ష్మితో గడపడానికి యునైటెడ్ స్టేట్స్ వెళ్లినట్లు తెలుస్తుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu